ఖమ్మం 14వ డివిజన్లో చిత్తడి నేలల పరిరక్షణ ప్రాధాన్యతపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించిన జిల్లా అటవీ శాఖాధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అధిక వర్షపాతం సమయాన వరద నీటిని నిల్వచేసి భూగర్భ జలాలను పెంపొందించడంలో చిత్తడి నేలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వీటిని పరిరక్షించుకోవాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయని, అరుదైన పక్షులు, జీవరాశులకు ఆవాసంగా నిలుస్తున్నాయని తెలిపారు.