ఖమ్మం, రూరల్ కమిటీ ఆధ్వర్యంలో సీపీఎం నేత సామినేని రామారావు హత్యను ఖండిస్తూ మంగళవారం ఖమ్మం నగరంలో నిరసన ప్రదర్శన జరిగింది. పాత బస్టాండ్ నుంచి జడ్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, దుండగులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, తదితర నాయకులు పాల్గొన్నారు.