ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పర్యావరణ వారోత్సవాలు, గ్రామసభల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ సి. వి. ఆనంద్, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, సెర్ప్ కమీషనర్ దివ్య తదితర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాబోయే 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు.