గత పదేళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా కూల్చివేయడం దుర్మార్గపు చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు అన్నారు. ఆదివారం ఖమ్మం భూదాన్ భూముల్లో కూల్చివేసిన పేదల ఇళ్లను పరిశీలించి ఆయన మాట్లాడారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదని, పేదల వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. బాధితుల పక్షాన బీజేపీ పోరాడుతుందని తెలిపారు.