ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు ఏఐకేఎస్ జాతీయ 30వ మహాసభ తమిళనాడులోని నాగపట్నంలో జరుగునున్నాయని, ఈ మహాసభలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతాంగ పోరాటాలకు రూపకల్పన చేయనునట్లు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు బాగం హేమంతరావు తెలిపారు. ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు మహాసభకు తరలివెళ్లారు. వ్యవసాయ రంగం రోజురోజుకు సంక్షోభంలోకి కూరుకుపోతుందని అన్నారు.