ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి విద్యాసంస్థల బంద్ పాటించనున్నట్లు కళాశాలల యజమాన్యాలు ప్రకటించాయి. ఖమ్మం జిల్లాలో ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఎంఈడీ, ఫార్మసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో సుమారు 20వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో తమపై భారం పడుతోందని, అందుకే ఈ బంద్ నిర్ణయం తీసుకున్నట్లు యజమాన్యాలు వెల్లడించాయి.