ఖమ్మం: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి

3చూసినవారు
ఖమ్మం: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు రూ. 8 వేల కోట్లకుపైగా ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆయన విమర్శించారు. గతంలో విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్ ప్రకటించి ఏడాదిపాటు పోరాడితే రూ. 1, 200 కోట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని, దీంతో మళ్లీ విద్యాసంస్థలు బంద్ చేశాయని తెలిపారు.

ట్యాగ్స్ :