ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్కును మంగళవారం డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ సందర్శించి, అభివృద్ధి పనులను పరిశీలించారు. వేసవిలో అడవుల రక్షణపై అటవీ శాఖ సిబ్బంది ప్రదర్శన ఇచ్చారు. బ్లోయర్లు, అగ్ని నియంత్రణ పద్ధతులతో ఎండిన గడ్డి మంటలు వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు వేగవంతమైన ప్రతిస్పందన చర్యలను సిబ్బంది ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ పలు సూచనలు చేశారు.