ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఐదు యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థల పనులను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. నగరంలోని డివైడర్లపై మొక్కలు నాటేందుకు అటవీ శాఖతో సమన్వయం చేసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. భూగర్భ డ్రైనేజీ పనులను గడువులోగా పూర్తి చేయాలని, పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు.