గత రెండున్నరేళ్లలో ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ. 2,500 కోట్లు మంజూరు చేయించారని కార్పొరేటర్ కమర్తపు మురళి తెలిపారు. ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకులు మేడారపు వెంకటేశ్వర్లు, నాగుల్ మీరా, రవినాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఖమ్మం నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, కల్యాణలక్ష్మి పథకం ద్వారా 2,130 మంది లబ్ధి పొందారని వారు వివరించారు.