కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక
కాంగ్రెస్ ఆఫీస్ నుండి బాబురావు పెట్రోల్ బంక్ మీదుగా మయూరి సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఇంధన ధరలను తగ్గించి సామాన్య ప్రజలపై భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.