శనివారం టేకులపల్లి మండలంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. సులానగర్ గ్రామానికి చెందిన రవి ఆదివారం చర్చికి రావాల్సిన సందర్భంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఆరవ మైలు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక కూర్చున్న ఘనమల్ల భిక్షంకు బలమైన గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.