త్వరలో జరగబోయే తెలంగాణ స్టేట్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్న సీనియర్ అడ్వకేట్ మర్రి ప్రకాష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి కోరారు. ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ప్రకాశ్ కు మద్దతుగా ఖమ్మం కోర్టు ప్రాంగణంలో పోస్టర్లు ఆవిష్కరించారు. దళిత, బహుజన న్యాయవాదులంతా మద్దతు తెలిపి స్టేట్ బార్ అసోసియేషన్లో మాలల గొంతుక వినిపించాలని కోరారు.