ఖమ్మం నియోజకవర్గంలో వ్యవసాయం, తాగునీటితో సహా అన్ని రంగాల్లో ముందస్తు ప్రణాళిక అవసరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఖరీఫ్-2026 వ్యవసాయ ప్రణాళిక, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సిద్ధంగా ఉంచాలని, వచ్చే వారం నుంచే రైతు వేదికల ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.