ఖమ్మం 23వ డివిజన్ కార్పొరేటర్ మగ్బుల్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో బుధవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్పొరేటర్ మగ్బుల్ తన పదవీకాలంలో డివిజన్ అభివృద్ధికి కృషి చేసి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండే నాయకుడిగా ప్రజల విశ్వాసాన్ని, మంచి పేరును సంపాదించుకున్నారని కొనియాడారు.