ఖమ్మం నగరంలోని పలు హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలును జిల్లా పౌర సరఫరాల అధికారి (డీసీఎస్ఓ) చందన్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. టీజీఎస్ఈడబ్ల్యూఆర్ఎస్ కళాశాల, టేకులపల్లి బాలికల హాస్టళ్లలో వంటశాలలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం రేషన్ దుకాణాలను సందర్శించి, ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యాన్ని పేదలకు పారదర్శకంగా, సకాలంలో పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు.