ఖమ్మం: ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక

3చూసినవారు
ఖమ్మం: ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక
ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా విస్తరింపజేసిన మహోన్నత వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్