ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యుల సమయపాలన లోపించింది. బుధవారం కార్డియాలజీ విభాగంలో ఉదయం 9 గంటలకు రావాల్సిన వైద్యులు 11 దాటినా రాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు వైద్యుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఉన్నతాధికారులు స్పందించి వైద్యులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.