ఖమ్మం నగరంలో గురువారం ఆస్తి వివాదంలో మోటె రాములమ్మ(70) అనే వృద్ధురాలిని ఆమె మరిది కొడుకు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రాములమ్మ కుటుంబానికి స్వగ్రామంలో 27 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై సోదరులతో న్యాయస్థానంలో వివాదం నడుస్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. నిందితుడు శేఖర్ పై రౌడీషీట్ ఉందని, అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాములమ్మ మృతదేహాన్ని సర్వజనాసుపత్రి శవాగారానికి తరలించారు.