ఖమ్మంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు మాట్లాడుతూ, అర్హులైన ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా
కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో అందరికీ అవకాశం కల్పిస్తామని చెప్పినా, ఆ దిశగా సరైన చర్యలు లేవని విమర్శించారు. 1930 తర్వాత పూర్తిస్థాయి కులగణన జరగకపోవడంతో బీసీలకు న్యాయం జరగడం లేదని, కులాల వారీగా జనగణన జరిగితేనే బీసీల అసలు జనాభా వెలుగులోకి వచ్చి, రాజకీయ, సామాజిక హక్కులు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.