మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ, పర్యావరణ వారోత్సవాలు, గ్రామసభలు, వార్డు సభల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. జూన్ 4, 6, 8, 10 తేదీలలో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని, ప్రస్తుతం అమలులో ఉన్న పర్యావరణ కార్యక్రమాలతో పాటు ఈ సభలను నిర్వహించాల్సి ఉంటుందని, గ్రామ, వార్డు సభలలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.