ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పంచాయతీ ఎన్నికల శిక్షణకు ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైన 10 మంది అధికారులకు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల విధులు కీలకమైనవని, హాజరుకాని అధికారులకు కఠిన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ చర్య అధికారుల్లో కలకలం రేపింది.