ఖమ్మం నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని సంబంధిత అధికారులకు అందజేశారు. గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు, ప్రజలు తమ ఫిర్యాదు స్థితిని తెలుసుకునేలా రశీదులు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.