పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ నిరసనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాయకులు ఇటికాల రామకృష్ణ మాట్లాడుతూ, తక్షణమే పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు.