ఖమ్మం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ, ఫిబ్రవరి 25న ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు 66 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ముందుగానే హాల్ టికెట్లను విద్యార్థుల వాట్సప్ కు పంపినందున, ఏవైనా తప్పులుంటే సరిచేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో పద్మశ్రీ, డీఎంహెచ్ఓ రామారావు, సీఐ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.