ఖమ్మం-పందిళ్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఖమ్మం మార్చురీలో భద్రపరిచారు. మృతుని వివరాలు తెలిసినవారు 9652939431 నంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.