ప్రేమ పేరుతో సహజీవనం చేస్తూ చివరకు ప్రియుడిని హత్య చేసిన మహిళను అరెస్ట్ చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవపురానికి చెందిన మడికంటి లావణ్యకు భర్తతో విభేదాల కారణంగా విడిపోయి సత్తుపల్లిలో తన తండ్రితో కలిసి నివసించేది. ఆ తర్వాత వివాహమైన రవిప్రసాద్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య గొడవ రావడంతో లావణ్య కాళ్లతో తన్నడంతో రవిప్రసాద్ మృతి చెందాడు.