ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి చెందిన బి. మోతి కుమార్ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను (5,364 మీటర్లు) విజయవంతంగా అధిరోహించారు. 53 కిలోమీటర్ల క్లిష్టమైన మార్గాన్ని కేవలం 26 గంటల 9 నిమిషాల్లో పూర్తి చేసి, అక్కడ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మోతి కుమార్, త్వరలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే తన లక్ష్యమని చాటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.