మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ ఆదివారం ఖమ్మం చేరుకున్నారు. జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, నగర అధ్యక్షుడు దీపక్ చౌదరి ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ కేడర్ను సమాయత్తం చేయడానికి మంత్రి సురేఖ పలు సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ, గజ్జెల్లి వెంకన్న, దొబ్బల సౌజన్య, రంగా జనార్దన్ కూడా పాల్గొన్నారు.