ఖమ్మం జిల్లా న్యాయస్థానాన్ని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి బుధవారం సందర్శించారు. బార్ అసోసియేషన్ ఆహ్వానంతో కోర్టుకు వెళ్లిన ఆయన, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కారం అందుకున్నారు. వేసవి దృష్ట్యా రామసహాయం కల్పనా రెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన దద్దోజనం, పెరుగన్నం పంపిణీని ఎంపీ పరిశీలించారు. ఈ కార్యక్రమం జూన్ 1వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం సొసైటీ రూమ్ను కూడా పరిశీలించారు.