ఖమ్మం జిల్లా, అశ్వారావుపేటలో మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో BRS పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై, నాయకులతో చర్చించారు. ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.