ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్పామ్ సాగుకు చిరునామాగా మారుతోంది. మంత్రి తుమ్మల చొరవతో అధికారులు నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రభుత్వం రాయితీపై కేవలం ₹20లకే మొక్కలు అందజేస్తుండటంతో అన్నదాతలు ఈ సాగుపై మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 15 వేల మంది రైతులు ఆయిల్పామ్ సాగు చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. సంప్రదాయ పంటల కంటే అధిక ఆదాయం లభిస్తుండటంతో రైతులు ఈ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.