ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి శుక్రవారం ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలలో ముమ్మరంగా పర్యటించారు. ముందుగా వారికి జిల్లా కాంగ్రెస్ నాయకులు పుష్ప గుచ్ఛాలను అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం వివిధ మండలాల ముఖ్య నాయకులతో సమావేశమై పలు అంశాలను గురించి చర్చించారు.