ఖమ్మం నగరంలోని గోపాలపురం -అల్లిపురం చింతకాని మేజర్ ఎన్ఎస్పీ కాలువను నీటిపారుదల శాఖ జిల్లా అధికారి వంగళపూడి వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. వరినాట్లు పోసుకునేందుకు, చెరుకు పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేయాలని అధికారులను కోరగా ఎస్ఈ స్పందించి, ఇటీవలే నీటిని విడుదల చేశారు. ఈ మేరకు కాలువను అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.