ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 'జనగణన 2027' స్వీయ నమోదు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆయన స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. సాంకేతికతను ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ తమ వివరాలను పారదర్శకంగా నమోదు చేసుకోవాలని, కచ్చితమైన గణాంకాల ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి సమర్థవంతంగా అందుతాయని ఆయన పేర్కొన్నారు.