అల్లుడికి బ్రెయిన్ స్ట్రోక్.. దుబాయ్లోనే మంత్రి!

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అల్లుడు కల్యాణ్ శేఖర్ అనారోగ్యం కారణంగా గత నెల 23 నుంచి దుబాయ్లోనే ఉంటున్నారు. బ్రెయిన్ స్ట్రోక్కు గురైన కల్యాణ్కు అక్కడి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సోమవారం వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేదని, పునరావాస కేంద్రానికి తరలించాలని సూచించారు. భారత్కు విమానాలు రద్దు కావడంతో ఈ నెల 6 వరకు హైదరాబాద్కు రాలేని పరిస్థితి ఉందని మంత్రి తుమ్మల తెలిపారు.
