ఖమ్మం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ)గా ఎన్. శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.