నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకుడు దండి సురేష్ పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్లో జరిగిన ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో 10 శాతం, జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించకుండా విద్యా విధానాన్ని అమలు చేయడం సరికాదని అన్నారు. ఈ విధానం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని ఆయన విమర్శించారు.