మొంథా తుపాను ప్రభావంతో ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మంలో మున్నేరు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నది ప్రవాహం 25 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతికి సమీపంలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి, దీంతో నివాసాలు, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. వరద బాధితులను సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టారు.