ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి, పత్తి ధరలు స్థిరంగా నమోదయ్యాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 19,300, కొత్త మిర్చి ధర రూ. 19,450గా ఉంది. పత్తి క్వింటా ధర రూ. 7,700గా జెండాపాట పలికింది. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి, పత్తి ధరలు మారలేదు. అయితే, కొత్త మిర్చి ధర మాత్రం రూ. 50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.