ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు స్థిరంగా కొనసాగాయి. క్వింటా ఏసీ మిర్చి రూ. 15,300, నాన్ ఏసీ మిర్చి రూ. 8,000, కొత్త మిర్చి రూ. 16,529, పత్తి రూ. 7,000గా ధర పలికింది. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి, పత్తి ధరలు మారనప్పటికీ, కొత్త మిర్చి ధర మాత్రం రూ. 40 తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.