ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం ఏసీ మిర్చి, కొత్త మిర్చి క్వింటా ధర రూ. 19,000గా, పత్తి క్వింటా ధర రూ. 7,300గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర రూ. 100 పెరగ్గా, కొత్త మిర్చి ధర స్థిరంగా ఉంది. పత్తి ధర మాత్రం రూ. 100 తగ్గింది. మిర్చి ధరలు మరింత పెంచాలని రైతులు కోరుతున్నారు.