ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి, పత్తి ధరలు పెరిగాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 21,800, నాన్ ఏసీ మిర్చి ధర రూ. 20,600, పత్తి ధర రూ. 8,500గా నమోదైంది. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 300, పత్తి ధర రూ. 200 పెరిగాయి. నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉంది. రైతులు నిబంధనలు పాటించాలని మార్కెట్ కమిటీ సూచించింది.