ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు వెల్లడయ్యాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 21,600, నాన్ ఏసీ మిర్చి ధర రూ. 17,600, పత్తి ధర రూ. 8,350గా నమోదైంది. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 100 పెరిగింది, నాన్ ఏసీ మిర్చి ధర రూ. 200 తగ్గింది. పత్తి ధర మాత్రం స్థిరంగా ఉందని వ్యాపారస్తులు తెలిపారు.