ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 15,400, నాన్ ఏసీ మిర్చి రూ. 8,000, పత్తి ధర రూ. 7,100గా నమోదైంది. గత మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 325, పత్తి ధర రూ. 100 పెరిగింది. నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు.