చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సామినేని రామారావు శుక్రవారం ఉదయం తన ఇంట్లోని పత్తి ఆరబెట్టిన గదిలో రక్తపు మడుగులో పడి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఎవరో హత్య చేసి ఉంటారని వారు అనుమానిస్తూ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.