ఖమ్మం జిల్లా మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం చింతకాని మండల పరిధిలోని పలు గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అహర్నిశలు కృషి చేస్తుందని తెలియజేశారు.