ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని చెరువును ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు ముమ్మరమయ్యాయి. మంగళవారం డీఎఫ్ఓ అనుజ్ అగర్వాల్ అధికారులతో కలిసి చెరువు పరిసరాలను పరిశీలించి, ప్రకృతి అందాలను కాపాడుతూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. జీవ వైవిధ్య సంరక్షణతో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.