బోనకల్ మండలంలో మంగళవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారి, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీనితో రహదారులు జలమయం అయ్యాయి. ఆకస్మిక వర్షంతో పత్తి, వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో నీరు నిలవడంతో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.