మధిర నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఇందిరా మహిళా డెయిరీకి సంబంధించి కార్యాచరణను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదివారం మధిర క్యాంప్ ఆఫీస్లో జిల్లా కలెక్టర్ అనుదీప్తో కలిసి సంబంధిత అధికారులతో ఇందిరా మహిళా డైరీపై సమావేశం నిర్వహించారు. రానున్న 20రోజుల లోపు పూర్తిస్థాయిలో పథకాన్ని అమలు చేయాలన్నారు.